మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (19:11 IST)

ముంబైలో వాలిన ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ!

ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనపరిచిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, తన ప్రియురాలి అనుష్క శర్మతో కలిసి శనివారం ఉదయం ముంబైకు చేరుకున్నారు. వీరిద్దరు.. ఎయిర్ పోర్టును వెలుపలికి ఒకరిచేయి ఒకరు పట్టుకుని బయటకు రావడంతో ఫోటోగ్రాఫర్లు వారిని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. 
 
కాగా, సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా ఆటగాళ్లలో కొందరు భారత్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి పలు విడతలుగా వారు స్వదేశంలో అడుగుపెడుతున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీకి చేరుకోగా, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ముంబైకు చేరారు. అలాలగే, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి కూడా ముంబైనే దిగినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించింది.