అనుష్క శర్మతో కలిసి ఇల్లు వెతికిన కోహ్లీ.. ఐదు బెడ్రూమ్ల ఫ్లాట్ కొనేశాడోచ్!
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో రూ. 34 కోట్లు పెట్టి ఓ లగ్జరీ అపార్టుమెంటును కొన్నాడు. ఓంకార్ రియల్టార్స్ అండ్ డెవలప
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో రూ. 34 కోట్లు పెట్టి ఓ లగ్జరీ అపార్టుమెంటును కొన్నాడు. ఓంకార్ రియల్టార్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్టులోని టవర్ - సీలో 7,171 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ ఫ్లాట్లో ఐదు బెడ్ రూముల సౌకర్యం ఉంది. 2014లో ఇదే అపార్ట్మెంట్లోని 29వ అంతస్తును జట్టులో సహచరుడైన యువరాజ్ సింగ్ కొనుగోలు చేశాడు.
కాగా కోహ్లీ ఇప్పుడు 35వ అంతస్తును కొనుగోలు చేశాడు. గత కొన్ని నెలలుగా ప్రేయసి అనుష్క శర్మతో కలిసి ముంబయిలో ఇల్లు వెతికిన కోహ్లి ఈ మధ్యనే ఈ ఫ్లాట్కు సంబంధించి వ్యవహారాలు చక్కబెట్టినట్లు తెలిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లాట్ని 2018లో కోహ్లికి అప్పగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొన్ని నెలల నుంచి ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్తో చర్చలు సాగించిన అనంతరం అపార్ట్ మెంట్ను కొనుగోలు చేశాడు. మరి ఆ లగ్జరీ ఫ్లాట్లోకి కోహ్లీ, అనుష్కలు దంపతులుగా అడుగుపెడుతారో లేదో వేచి చూడాల్సిందే..!