మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 జులై 2016 (14:56 IST)

ప్రీమియర్ ఫుట్‌సల్ కోసం విరాట్ కోహ్లీ-ఏఆర్ రెహ్మాన్‌ల ఆటాపాటా.. మీరూ చూడండి!

ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచే పాటకు టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాత్రంతో పాటు స్టెప్పులు కూడా వేశాడు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే గాయకుడిగా పలు స్టేజ్‌లపై పాటలు పాడే అనుభవమున్న కోహ్లీ రెహ్మాన్ పాటకు స్టెప్పులేసి అదరగొట్టేశాడు.
 
కాగా ప్రీమియర్ ఫుట్‌సల్ పేరుతో ట్వంటీ-20 సాగర్‌ లీగ్‌కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇంకా ఫుట్‌సల్‌ లీగ్‌ అధికారిక గీతాన్ని ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరపరచగా, లీగ్‌కు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించాలనే ఉద్దేశంతో కోహ్లీని గాత్రం అందిచాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఇందుకు కోహ్లీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో రూపొందిన పాటకు సోషల్ మీడియా మంచి ఆదరణ లభిస్తోంది.