శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 జులై 2015 (15:54 IST)

సఫారీ గడ్డపై వాలిపోయిన ప్రేమ పక్షులు: స్విమ్మింగ్ పూల్‌ బయట..?

భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలితో సఫారీ గడ్డపై తళుక్కుమన్నాడు. కొద్ది నెలల పాటు మీడియా కంట పడకుండా ఉండిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు దక్షిణాఫ్రికాలో మీడియాకు కనిపించారు. జింబాబ్వే టూర్ నేపథ్యంలో కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దాంతో, కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి దక్షిణాఫ్రికాలో వాలిపోయాడు. 
 
అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ, చారిత్రక స్థలాలను సందర్శిస్తూ విశ్రాంతి సమయాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తన విదేశీ యాత్ర గురించి కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్టు చేశాడు. ఓ స్విమ్మింగ్ పూల్ బయట కాళ్లు చాపుకుని కూర్చుని ఉన్న ఫొటోను పోస్టు చేశాడు. 
 
అయితే, ఆ ఫొటోలో అనుష్క శర్మ లేకపోయినా.. కోహ్లీ, అనుష్క బస చేసిన సబీ సబీ ఎర్త్ లాడ్జ్ లోని ఓ చెఫ్ చేసిన ట్వీట్‌‍తో విషయం బయట పడింది. బీసీసీఐ ఇచ్చిన సెలవులను కోహ్లీ తన ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడట.