విరాట్ కోహ్లీపై పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్ ప్రశంసలు.. కోహ్లీ ఆటను మర్చిపోడట!
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్ పరుగుల యంత్రం అయిన విరాట్ కోహ్లీ దూకుడు అదుర్స్ అన్నాడు. దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించడంలో కోహ్లీనే దిట్ట అంటూ కొనియాడాడు. ఆసియా కప్ క్రికెట్ టోర్నలో తమ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఆటను ఎప్పటికీ మరిచిపోనని అమీర్ వ్యాఖ్యానించాడు.
కాగా స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఆరోపణలు రుజువై మ్యాచ్ల నుంచి బహిష్కరణకు గురైన అమీర్కు ఇటీవలే మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కింది. ఆరేళ్ల విరామం తర్వాత అమీర్కు జాతీయ జట్టులో స్థానం దక్కడం పట్ల అతడు హర్షం వ్యక్తం చేశాడు. ఇకపోతే.. పాక్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ జట్టుతో నాలుగు టెస్ట్ మ్యాచ్లు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్లను ఆడనుంది.