మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (13:56 IST)

ధోనీని ఉపయోగించుకో కోహ్లీ.. అతనికి ప్రమోషన్ ఇవ్వు.. లేకుంటే నష్టమే: గంగూలీ

బెంగళూరులో బుధవారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలని భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అవసరమైతే జట్టులో కూడా కొన్ని మార్పులు చేయాలన్నాడు

బెంగళూరులో బుధవారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలని భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అవసరమైతే జట్టులో కూడా కొన్ని మార్పులు చేయాలన్నాడు. రైనాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం వల్ల చివర్లో భారీ షాట్స్ ఆడే ఆటగాడిని కోల్పోతున్నామని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పాండ్యా, ధోనీ ఉన్నా, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ ఉండటం కొంత మంచిదని తనకనిపిస్తుందని.. కాబట్టి అతని ఆర్డర్‌లో మనీష్ పాండేని పంపాలని గంగూలీ చెప్పుకొచ్చాడు. 
 
ఇక ధోనీకి తప్పకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇస్తేనే మంచి ఫలితాలను ఆశించవచ్చునని తెలిపాడు. ఎందుకంటే అతడు మునపటిలా కాదు. ఇప్పుడు చాలా స్వేచ్చగా ఆడుతున్నాడు. అలాంటి సమయంలో కోహ్లీ అతడిని సరిగా ఉపయోగించుకుంటే జట్టు భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో కూడా ధోని సలహా తీసుకుంటే మంచిదని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇంకా చెప్పాలంటే.. ధోనీని ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. భారత్ రెండో టీ-ట్వంటీలో గెలిచినా అది బౌలర్ల గొప్పదనమేనని, బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టుకు మంచిది కాదని గంగూలీ తెలిపాడు.