శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (11:38 IST)

స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న కోహ్లీ.. బీసీసీఐ వార్నింగ్!

స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. జట్టు పరువు, ప్రతిష్ఠలు పెంచే రీతిలో ప్రవర్తించాలే తప్ప ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని బీసీసీఐ పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది.
 
ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కోహ్లీకి క్లాజ్ పీకారు. అలాగే ఈ వివాదంలో కోహ్లీని వెనకేసుకొచ్చిన టీమిండియా మేనేజ్ మెంట్‌కు కూడా బీసీసీఐ వార్నింగిచ్చింది. అనవసర రాద్ధాంతం మాని మెగాటోర్నీపై దృష్టి సారించాలని బీసీసీఐ కాస్త గట్టిగానే మందలించింది.