శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (13:07 IST)

కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటర్‌గా సెహ్వాగ్: కొత్త బాధ్యతలు అప్పగించిన ప్రీతిజింటా!

ఢిల్లీ హీరో, మాజీ టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహయజమానికి కొత్త బాధ్యతలు అప్పగించారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడిగా రాణించిన వీరేంద్రుడు ఇక మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్‌కు సెహ్వాగ్ సహాయకుడిగా వ్యవహరించనున్నాడు. 
 
దీనిపై బంగర్ మాట్లాడుతూ.. గత రెండు సీజన్లలో సెహ్వాగ్ బ్యాట్స్‌మన్‌గా జట్టులో స్ఫూర్తినింపాడని తెలిపాడు. ప్రస్తుతం మెంటర్‌గా అతని సలహాలు, సూచనలతో జట్టుకు ప్రయోజనాలు చేకూరుతాయని ఆశించాడు. సెహ్వాగ్ నియామకం జట్టును మరింత పటిష్ఠం చేస్తుందని బంగర్ ఆకాంక్షించాడు.
 
దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. కొత్త ఫ్రాంచైజీలో కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పాడు. తనకు కింగ్స్ ఎలెవన్ తరపున లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపాడు. కింగ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.