శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (15:46 IST)

భారత బౌలర్ల ధాటికి విండీస్ విలవిల: 182 పరుగులకే ఆలౌట్!

టీమిండియా బౌలర్ల ధాటికి వెస్టిండీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత్‌కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్ 44.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. విండీస్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు.
 
కెప్టెన్ హోల్డర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. గేల్ 21, కార్టర్ 21, సామీ 26, టేలర్ 11 పరుగులకే అవుట్ అయ్యారు. రామదిన్ డకౌటయ్యాడు. 
 
స్మిత్(6), శ్యామ్యూల్స్(2), సిమ్సన్(9), రసెల్(8) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, ఉమేష్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లు తీశారు. అశ్విన్, మొహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.