మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (11:49 IST)

పెర్త్‌లో అభిమానులకు నిరాశ: పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో..?

పెర్త్‌లో అభిమానులకు నిరాశే మిగిలింది. పెర్త్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో ఫోటోలు దిగాలని నిరీక్షించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రాక్టీస్ అనంతరం అభిమానులను పట్టించుకోకండా వారి తిరిగి హోటల్ గదులకు వెళ్లడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.
 
ఫిబ్రవరి 22(ఆదివారం)న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అభిమానులు ఇచ్చిన మద్దతుతో గెలిచిన టీమిండియా ఇలా నిర్లక్ష్యం చేయడం బాధగా ఉందని అభిమానులు వాపోయారు. మెల్‌బోర్న్ మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ ఇది మెల్ బోర్న్‌లా లేదు ముంబైలా ఉందన్న సంగతి తెలిసిందే.
 
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 130 పరుగుల విజయంతో గెలుపొందింది. ఫిబ్రవరి 28(శనివారం)న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరగనున్న మ్యాచ్‌ కోసం పెర్త్‌లో టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది.