డీఆర్ఎస్ వచ్చేస్తోంది.. భారత క్రికెట్ బోర్డుకి బద్ద వ్యతిరేకి..
ఆస్ట్రేలియా టూర్లో భారత్కు రెండో ఓటములు నమోదైనాయి. ప్రపంచంలో ఏ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగినా అక్కడ అంపైర్ నిర్ణయ పునఃస్సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) ఉంటోంది. కానీ ఎందుకో ఆది నుంచీ డీఆర్ఎస్కు భారత క్రికెట్ బోర్డు బద్ద వ్యతిరేకి. రెండు దేశాలకు సమ్మతి అయితేనే ఈ పద్ధతి అమల్లో ఉంటుంది.
కాబట్టి భారత్ ఆడే టెస్టు సిరీస్ల్లో డీఆర్ఎస్ కనిపించదు. అయితే ఆసీస్ పర్యటనలో పలు నిర్ణయాలు భారత్కు వ్యతిరేకంగా వచ్చాయి. జరిగిన రెండు టెస్టుల్లో కనీసం ఐదు సార్లు డీఆర్ఎస్ లేని కారణంగా తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో మాజీ ఆటగాళ్లు కొందరు ఈ పద్ధతికి మద్దతుగా గళం విప్పుతున్నారు.
ఎంతగా పోరాడినప్పటికీ అంపైరింగ్ తప్పిదాలతో జట్టు ఓడిపోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. కాబట్టి ఈ పద్ధతిని అమలు పరిచేందుకు ఇదే సరైన సమయమని వారు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ‘సాంకేతికంగా ఎలాంటి పద్ధతితోనైనా కచ్చిత నిర్ణయాలు వస్తే వాటిని స్వాగతించాల్సిందే. నేను డీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు. అయితే వంద శాతం కచ్చిత నిర్ణయాలు రావాలంటే ఈ పద్ధతి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. హాట్స్పాట్ లేక హాక్ఐ ద్వారా ఎల్బీను పరిశీలించడంపై నమ్మకం ఉంచలేకపోతున్నాను. ఈ రెండు విషయాలు డీఆర్ఎస్ పద్ధతిలో ఓ కొలిక్కి రావాల్సి ఉంది. అని భజ్జీ అన్నాడు.