శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (21:39 IST)

ఐసీసీ సస్పెన్షన్: 3నెలల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అజ్మల్!

ఐసీసీ సస్పెన్షన్ విధించడంతో మూడు నెలల తర్వాత అజ్మల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కనిపించాడు. ఐసీసీ సస్పెన్షన్ విధించడంతో మూడు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఎట్టకేలకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్‌లోకి దిగాడు.
 
ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా లాహోర్‌లో కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అజ్మల్ బౌలింగ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

పాకిస్థాన్- ఎ తరుపున కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేసిన అజ్మల్ ఒక వికెట్టు తీసి 23 పరుగులు ఇచ్చాడు. అయితే తాను చేసిన బౌలింగ్‌పై అజ్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే వరల్డ్ కప్ నాటికి జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.