భారత్పై ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యం : ఆస్ట్రేలియా కెప్టెన్
ఈనెల 17వ తేదీ నుంచి బ్రిస్బేన్లో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్పై ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తామని ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవెన్ స్మిత్ చెప్పాడు. ఇప్పటికే తొలి టెస్టులో నెగ్గి విజయం సాధించిన తాము మంచి జోరుమీద ఉన్నట్టు తెలిపారు.
బుధవారం నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్కు భారత్, ఆసీస్ జట్లు రెండో టెస్టుకు సిద్ధమవుతున్నాయి. బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. పిచ్ పేస్కు అనుకూలించినా భయపడబోమని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేస్తుండగా, 2-0 ఆధిక్యానికి ప్రయత్నిస్తామని ఆసీస్ యువ సారథి స్టీవెన్ స్మిత్ అంటున్నాడు.
ఈ మ్యాచ్పై స్మిత్ స్పందిస్తూ.. రెండో టెస్టు ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నామన్నాడు. కొన్ని వారాలుగా సాధారణ పిచ్లపై ఆడిన తమ బౌలర్లు, ఇప్పుడు జీవం తొణికసలాడే గబ్బా పిచ్పై బౌలింగ్ చేసేందుకు తహతహలాడుతున్నారని స్మిత్ చెప్పుకొచ్చాడు. పిచ్పై పచ్చిక కారణంగా జట్టులోకి మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్ వుడ్లను తీసుకువచ్చామని వెల్లడించాడు.