భారత్ టూర్ రద్దు : వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం!
భారత్ టూర్ను అర్థాంతరంగా ముగించుకున్న వెస్టిండిస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం జారీ చేశారు. గతేడాది టీమిండియాతో టెస్టు మ్యాచ్లు ఆడేందుకు వచ్చిన కరీబియన్ టీమ్ మధ్యలోనే వెళ్లిపోయింది. దాంతో, ఆగ్రహించిన బీసీసీఐ, వెస్టిండిస్ జట్టుకు అల్టిమేటం జారీ చేసింది.
సిరీస్ అర్థాంతరంగా రద్దయిన నేపథ్యంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్న బీసీసీఐ, నష్టపరిహారాన్ని డిమాండ్ చేసింది. తాజాగా మరోమారు ఈ విషయంపై వెస్టిండిస్ బోర్డుకు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ, తనకు జరిగిన నష్టానికి గాను 41.97 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది.