బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (11:44 IST)

చాంపియన్స్ లీగ్ టి20 : ముంబై ఇండియన్స్ ఓటమి!

చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ ముంబయి ఇండియన్స్ ఓటమిపాలైంది. పాకిస్థాన్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్‌తో రాయ్ పూర్‌లో గతరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. 
 
యువ బ్యాట్స్ మన్ ఆదిత్య తారే (37) ఆ జట్టులో టాప్ స్కోరర్. వెటరన్ మైక్ హస్సీ 28 పరుగులు చేయగా, కెప్టెన్ పొలార్డ్ (6) నిరాశపరిచాడు. అనంతరం, లక్ష్యఛేదనలో లాహోర్ లయన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసి విజయభేరి మోగించింది. 
 
పాక్ జాతీయ జట్టు ఆటగాడు ఉమర్ అక్మల్ (38*) లయన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ షెహ్ జాద్ 34 పరుగులతో రాణించాడు. ముంబయి బౌలర్లలో ఓజా 2 వికెట్లు తీయగా, ఆదుకుంటాడనుకున్న 'యార్కర్ స్పెషలిస్ట్' మలింగ ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు.