శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (13:01 IST)

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్?

భారత క్రికెట్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో జరిగే పర్యటన తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
అయితే, సెహ్వాగ్ ఎంపిక త్వరలో జరగనున్న దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ‌లో ప్రదర్శించే ఆటతీరుపై అతనిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీలో గనుక సెహ్వాగ్ తన బ్యాట్‌ను ఝుళిపిస్తే... అతని ఎంపిక ఖాయమని బోర్డు వర్గాలు అంటున్నాయి. 
 
సెహ్వాగ్ ప్రస్తుత ఫామ్ ఎలా ఉందో తెలుసుకోవడానికే అతనిని నార్త్ జోన్ టీంలో ఎంపిక చేశారని బోర్డు ఉన్నతాధికారులు అంటున్నారు. వరుస బ్యాటింగ్ వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్ ఆఖరిగా 2013 లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.