శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (12:38 IST)

పాకిస్థాన్ క్రికెట్ కంట పడిన దెయ్యాలు.. భయంతో జ్వరం!

పాకిస్థాన్ యువ క్రికెటర్ హారీస్ సొహైల్‌కు దెయ్యాలు కనబడ్డాయట. తాను బస చేస్తున్న హోటల్‌లో భయానక అనుభవాన్ని హారిస్ సోహైల్ చవిచూశాడు. తనకు కేటాయించిన గదిలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ బెంబేలెత్తిపోయాడు. ఆ భయంతో ఆ గదిని వెంటనే ఖాళీ చేసేసి వెళ్లిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇక్కడ సోమవారం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడింది. జట్టు సభ్యులందరూ స్థానిక ఉన్న ఓ హోటల్‌లో బస చేశారు. అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కపడి లేచిన సొహైల్ తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. వెంటనే తన గది నుంచి బయటికి వచ్చాడు.
తన గదిలో ఏవో వింత దృశ్యాలు కనిపించాయని, అవి దెయ్యాలే అని చెప్పుకొచ్చాడు. ఆ భయంతో అతనికి తీవ్ర జ్వరం కూడా వచ్చేసింది. దీంతో హోటల్ సిబ్బంది సొహైల్‌ను మరో గదికి మార్చి ఉపశమనం కలిగించారు.
 
ఈ ఘటనపై పాక్ టీం మేనేజర్ మవీద్ అక్రమ్ చీవా మంగళవారం మాట్లాడుతూ.. కోచింగ్ సిబ్బందికి ఫోన్ చేసిన సొహైల్.. తాను తన గదిలో తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపాడని చెప్పారు. 
 
కాగా ఇలాంటి అనుభవాన్నే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా లండన్‌లోని ఓ హోటల్‌లో బస చేసిన సమయంలో ఎదుర్కొన్నాడు. లైట్లు, నీళ్ల కుళాయిలు వాటంతటే అవే ఆన్, ఆఫ్ అవుతూ, లైట్ వేస్తే ఫ్యాన్, ఫ్యాన్ వేస్తే కుళాయిలో నీళ్లు రావడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.