మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (10:57 IST)

మృత్యు బంతులు... మరో క్రికెటర్ దుర్మరణం

క్రికెట్ మైదానంలో మృత్యు బంతులు పరుగులు తీస్తున్నారు. ఈ బంతులు తగిలి క్రికెటర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. క్రికెట్ బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి వార్త మరువక ముందే ఆదివారం మరో సంఘటన చోటు చేసుకుంది. 
 
పాకిస్థాన్‌లోని ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే యువ క్రికెటర్  ప్రత్యర్థి పేసర్ వేసిన బంతి బలంగా ఛాతీకి తగలడంతో సంఘటనా స్థలంలోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే జీషన్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
 
అనంతరం జీషన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు బంతి తగలడంతో, తీవ్ర ఒత్తిడి కారణంగానే ఆయన మృతి చెందినట్టు తేల్చారు. అనంతరం జీషన్ మృతదేహాన్ని ఆయన తీసుకెళ్లి ఖననం చేశారు.