శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2014 (18:18 IST)

ధోనీ సామర్థ్యానికి తగిన గుర్తింపు దక్కలేదు : రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సామర్థ్యం, ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదని టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. సామర్థ్యానికి తగిన పేరుప్రతిష్ఠలు ధోనీకి దక్కడంలేదని అభిప్రాయపడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నాకిప్పుడు తెలిసింది, మరే ఇతర భారత కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో, ధోనీ ఖాతాలో ఇన్ని విజయాలు ఎలా సాధ్యమయ్యాయో!. ధోనీ అద్భుమైన నాయకుడు" అని కితాబిచ్చారు.
 
అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నపుడు ఎన్నో అశాలపై చర్చిస్తూ, జట్టును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపైనే ఆలోచన చేస్తుంటాడని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ధోనీకి తగిన గుర్తింపు రాలేదని, ఈ విషయంలో ధోనీ పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టు రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.