లార్డ్స్ మహిళా వన్డే మ్యాచ్ కూడా రద్దు: వర్షాలే కారణం!
భారీ వర్షాల కారణంగా అటు భారత్, ఇంగ్లండ్ పురుషుల జట్ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్లు రద్దయ్యాయి. లార్డ్స్లో సోమవారం జరగాల్సిన ఈ మూడో వన్డే రద్దు కావడంతో... మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ మహిళల జట్టు 2-0తో కైవసం చేసుకుంది.
ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్ జరిగినందున... ఇంగ్లండ్కు ఐదు పాయింట్లు, భారత్కు ఒక పాయింట్ దక్కాయి.