శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (14:07 IST)

బీజేపీలో చేరనున్న గంగూలీ: కమలనాథులతో భేటీ!?

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ కామేంటేటర్ సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే గురువారం బీజేపీ పెద్దలతో సమావేశమైన గంగూలీ వారితో చర్చిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.

2008లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా క్రికెట్ వ్యాఖ్యాతగా మారిన విషయం తెల్సిందే. 
 
వెస్ట్ బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందుకోసం కమలనాథులు చాపకింద నీరులా తమ ప్రణాళికలకు పదునుపెడుతున్నారు. ఇందులోభాగంగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులను తమ వైపుకు ఆకర్షించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. 
 
దీంతో గుంగూలీతో బీజేపీ అధిష్టాన సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చర్చలు సఫలమైతే గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ క్రికెట్ ప్రముఖ వ్యక్తులో ఒకరైన గంగూలీకీ భారీ అభిమానగణం ఉంది. ప్రత్యేకంగా బెంగాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే.