పద్మశ్రీ పురస్కారానికి ఎంపికవుతానని అనుకోలేదు!: మిథాలీ
అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారానికి తాను ఎంపికవుతానని అస్సలు అనుకోలేదని భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి పద్మశ్రీ అవార్డు రేసులో విరాట్ కోహ్లీ లాంటి మంచి ఆటగాళ్లు కూడా ఉండడంతో తనను ఎంపిక చేస్తారనుకోలేదని చెప్పింది.
‘ఈ అవార్డుకు కోహ్లీ కూడా రేసులో ఉండడంతో నేను ఆశలు వదులుకున్నా. సాధారణంగా మాకంటే పురుషుల క్రికెట్కే ఎప్పుడూ ప్రాధాన్యమిస్తారు. కానీ అనూహ్యంగా అవార్డు వరించినందుకు ఆశ్చర్యంలో మునిగిపోయా. యువత క్రికెట్ను కెరీర్గా ఎంచుకునేందుకు ఈ అవార్డులు ప్రేరేపిస్తాయి' అని మిథాలీ తెలిపింది.