శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:38 IST)

ధోనీ వ్యూహాలు అద్భుతం.. అందుకే గొప్ప క్రికెటర్ : ఐసీసీ చీఫ్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో అమలు చేసే వ్యూహాలు ఊహకందని విధంగా అద్భుతంగా ఉంటాయని, అందుకే అతను తాను చూసిన గొప్ప క్రికెటర్లలో ఒకరని ఐసీసీ చీఫ్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్‌ చెప్పుకొచ్చారు. 
 
ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసన్... చెన్నై సూపర్ కింగ్స్ సహయజమాని అయిన ధోనీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని క్రికెట్ పై ధోనీ విశేషమైన ప్రభావం చూపుతున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. కెప్టెన్‌గా భారత జట్టును ముందుకు నడిపించడంలోనే కాకుండా ఆయన గొప్ప క్రికెటర్ అని తెలిపారు. 
 
మైదానంలో ధోనీ వ్యూహాలు అమోఘమని ఆయన కీర్తించారు. ధోనీ నాయకత్వం 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో ఐసీసీ ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలను అందించిందని శ్రీనివాసన్ గుర్తు చేశారు.