గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (14:48 IST)

బీసీసీఐకి విండీస్ సిరీస్‌తో తలనొప్పి: నష్టాలు తప్పవట!

వెస్టిండీస్ అర్థాంతరంగా టీమిండియాతో కుదుర్చుకున్న ఐదు వన్డేల సిరీస్‌ నుంచి నిష్క్రమించడం ద్వారా బీసీసీఐకి తలనొప్పి తప్పట్లేదు. వెస్టిండీస్ సిరీస్‌ నుంచి మధ్యలోనే నిష్క్రమించడం ద్వారా బీసీసీఐ బోర్డుకు నష్టాలను తెచ్చిపెట్టిందని కార్యదర్శి సంజయ్ పటేల్ చెబుతున్నారు. 
 
భారత్ టూర్‌ను వెస్టిండీస్ ఆటగాళ్లు అనూహ్యంగా ఉపసంహరించుకోవడంవల్లే భారీ నష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు. విండీస్ బోర్డుపై దావావేసి ఐసీసీతో చర్చించి ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకుంటామని సంజయ్ పటేల్ వెల్లడించారు. చివరికి భారత్‌తో సిరీస్ ఆడేందుకు తక్కువ సమయంలో శ్రీలంక బోర్డుతో మాట్లాడి ఒప్పించామని పటేల్ చెప్పుకొచ్చారు.