గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (14:50 IST)

ఐసీసీ టీ-20 వరల్డ్ టోర్నీ భారత్‌లోనే.. 2016 మార్చి 11 నుంచి..!

ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్ కప్ టోర్నీని భారత్ వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
 
ఇక, స్లో ఓవర్ రేట్ విషయాల్లో కెప్టెన్లకు కొంత ఊరటనిస్తూనే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. ఇతర సిరీస్‌లలో నమోదైన స్లో ఓవర్ రేటు తప్పిదాలను ఐసీసీ వరల్డ్ కప్‌లో పరిగణనలోకి తీసుకోరు. 
 
అయితే, ఐసీసీ ఈవెంట్‌లో స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు పాల్పడే కెప్టెన్లపై మాత్రం నిషేధం అమలు కానుంది. ఈ మేరకు పలు అంశాలపై ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది.