భారత్ తొలి ఇన్నింగ్స్లో 330 రన్స్కు ఆలౌట్.. ఇంగ్లండ్ బ్యాటింగ్!
సౌతాంఫ్టన్లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 330 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఇంగ్లండ్ జట్టు భారత్కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టింది. అయితే, ఆ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 22 పరుగుల వద్ద తొలి వికెట్ను జారవిడుచుకుంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగులో రాబ్సన్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
ఇంగ్లండ్ 569 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ స్కోరుగా జవాబుగా బ్యాటింగ్కు దిగిన ఇండియా తొలి ఇన్నింగ్సులో 330 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండు తొలి ఇన్నింగ్సు స్కోరుపై 239 పరుగులు వెనకబడింది. రహనే, ధోనీ మాత్రమే కాస్తా నిలదొక్కుకుని అర్థ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు తీయగా, బ్రాండ్ మూడు వికెట్లు తీశాడు. మోయిన్ అలీకి రెండు వికెట్లు దక్కాయి.