శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (08:58 IST)

టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్..! మురళీ, ధావన్‌ల శుభారంబం..!

భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి గాబా మైదానంలో జరిగే రెండో టెస్టులో తొలిరోజు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత ఓపెనర్లుగా భారత ఆటగాళ్లు మురళీ విజయ్, ధావన్లు బరిలోకి దిగి శుభారంభం చేశారు. 
 
ఈ టెస్టులో భారత్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో సాహ, కరణ్ శర్మ, షమీ స్థానంలో భారత్ కెప్టెన్ ధోని, అశ్విన్, ఉమేష్లకు స్థానం దక్కింది. ఆసీస్ జట్టులో కూడా మూడు మార్పులు జరిగాయి. ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్, సిడిల్, హారిస్ స్థానంలో షాన్మార్ష్, మిచెల్ స్టార్క్, హజిల్ వుడ్లకు చోటు దక్కింది.
 
అడిలైడ్ లో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో తొలి టెస్టు నెగ్గిన ఆస్ట్రేలియా 1-0తో ముందంజలో ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం 0-1తో వెనకడుగుడుతో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉంది.