శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 16 ఆగస్టు 2014 (18:18 IST)

ఇంగ్లండ్ టూర్: అమ్మాయిలు గెలిచారు.. ధోనీ సేన ఏమౌతుందో?

భారత క్రికెట్ జట్లు ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనీ సేన దారుణ ప్రదర్శనలతో పరాజయాల బాటలో నడుస్తుండగా, మహిళల జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టుపై తొలి టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలుపు నమోదు చేసింది. 
 
వామ్ స్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేయగా, భారత్ 114 పరుగులు నమోదు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 202 పరుగులు చేయగా... మిథాలీ సేన 4 వికెట్లు కోల్పోయి 181 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించింది. 
 
కెప్టెన్ మిథాలీరాజ్ (50 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్థసెంచరీ సాధించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించడం విశేషం. ఈ విజయాన్ని చూసైనా టీమిండియా మేల్ స్టార్లు ఓవల్‌లో చెలరేగితే బాగుంటుందని క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.