మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 27 జులై 2014 (15:46 IST)

భారత జట్టుకు షాక్... ఇషాంత్ శర్మ దూరం.. ఇంగ్లండ్ బ్యాటింగ్!

సౌతాంఫ్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన మూడో టెస్టులో భారత క్రికెట్ జట్టుకు మ్యాచ్ ఆరంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా లార్డ్స్ టెస్ట్ హీరో ఇషాంత్ శర్మ తుది జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో పంకజ్ సింగ్‌ను ఎంపిక చేశారు. అలాగే, స్టువర్ట్ బిన్నీకి అనూహ్యంగా విశ్రాంతినిచ్చి రోహిత్ శర్మకు చోటు కల్పించారు. 
 
మరోవైపు.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా, రెండో టెస్టులో ధోనీ సేన విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. ఈ టెస్టులో భారత్‌ను ఇషాంత్ శర్మ ఒంటి చెత్తో గెలిపించిన విషయం తెల్సిందే. 
 
ఈ మ్యాచ్‌ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 
భారత్ : మురళీ విజయ్, శిఖర్ ధావన్, పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రెహానే, ధోనీ, జడేజా, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, పంకజ్ సింగ్. 
 
ఇంగ్లండ్ : కుక్, రూబ్సన్, బ్యాలెన్స్, బెల్, రూట్, అలీ, బట్లర్, వోక్స్, జోర్డాన్, బ్రాడ్, ఆండర్సన్.