బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (11:53 IST)

ఆ 11 రోజులు నరకం చూశాం.. జమ్మూ వరదలపై రసూల్!

జమ్మూ కాశ్మీర్‌ను ముంచెత్తిన వరదల్లో తన కుటుంబం కూడా చిక్కుకుందని ఆ రాష్ట్రానికి చెందిన భారత క్రికెటర్ పర్వేజ్ రసూల్ తెలిపాడు. తమ ఇంటిని కూడా వరద ముంచెత్తిందని రసూల్ చెప్పాడు. వరదలు అనంతనాగ్ జిల్లాను ముంచెత్తినప్పుడు రసూల్ బిజ్బెహరాలోని తన నివాసంలో ఉన్నాడు. 
 
గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్లలో మునిగిపోవడంతో, మొదటి అంతస్తులోనే ఉన్నామని, ఇంటి నుంచి బయటపడే అవకాశం లేకపోయిందని సోమవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఈ 11 రోజులు బాహ్య ప్రపంచంలో సంబంధం తెగిపోయిందన్నాడు.
 
గత 11 రోజులపాటు నరకం చూశాం. బయట అందరితోనూ సంబంధాలు తెగిపోయాయి. మేముంటున్న అనంతనాగ్‌లో టెలిఫోన్‌లు, మొబైల్ ఫోన్లు.. ఏవీ పని చేయలేదు. నేను, నా కుటుంబసభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం' అని రసూల్ తెలిపాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడిందని పర్వేజ్ రసూల్ చెప్పాడు.