అర్జున అవార్డు ఎంపిక కమిటీకి కపిల్ దేవ్ కెప్టెన్!
దేశంలో క్రీడాకారులకిచ్చే ప్రతిష్టాత్మక అవార్డుల్లో అర్జున పురస్కారం ఒకటి. ఈ అవార్డు అందుకోవడాన్ని క్రీడాకారులు గర్వంగా భావిస్తారు. కాగా, ఈ ఏడాది అర్జున అవార్డు ఎంపిక కమిటీకి లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ ప్రకటించారు.
కాగా, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీకి భారత హాకీ మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తారు. క్రీడల శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే కోచ్లకు ద్రోణాచార్య పురస్కారం అందిస్తారు. ఈ క్రీడా అవార్డులను ఆగస్టు 29న జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తారు.