మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. »
  3. క్రికెట్
  4. »
  5. వార్తలు
Written By Ganesh
Last Updated : బుధవారం, 28 మే 2014 (10:35 IST)

ఐపీఎల్-7: తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. నేటికి వాయిదా!

ఐపీఎల్-7లో మంగళవారం జరగాల్సిన తొలిక్వాలిఫయర్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. కింగ్స్‌ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి‌కూడా పడకుండా నిలిచిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షం కారణంగా ఈడెన్‌‌గార్డెన్స్ పిచ్ మొత్తం తడిసిముద్దయింది. దీంతో ఈ మ్యాచ్‌ను నేటికి వాయిదా వేశారు.

మంగళవారం ఆట సాధ్యం కాకపోవడంతో రిజర్వ్ డే అయిన బుధవారం నిర్వహిస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ఈ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది.