ఐపీఎల్-7లో మంగళవారం జరగాల్సిన తొలిక్వాలిఫయర్ మ్యాచ్ను వరుణుడు అడ్డుకున్నాడు. కింగ్స్ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతికూడా పడకుండా నిలిచిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షం కారణంగా ఈడెన్గార్డెన్స్ పిచ్ మొత్తం తడిసిముద్దయింది. దీంతో ఈ మ్యాచ్ను నేటికి వాయిదా వేశారు.
మంగళవారం ఆట సాధ్యం కాకపోవడంతో రిజర్వ్ డే అయిన బుధవారం నిర్వహిస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ఈ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది.
Copyright 2024, Webdunia.com