మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (16:40 IST)

అజారుద్దీన్ రికార్డును సమం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ!

అంతర్జాతీయ క్రికెట్‌లో 50 ఓవర్ల పరిమిత వన్డే మ్యాచ్‌లలో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డు ఇప్పటి వరకు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ పేరుమీద ఉండేది. దీన్ని ధోనీ సమం చేశాడు. 
 
ట్రెంట్ బ్రిడ్జ్‌లోని నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన శనివారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ద్వారా ధోనీ కెప్టెన్‌గా 90వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అజ్జూ 174 మ్యాచ్ లలో 90 విజయాలు సాధించగా, ధోనీ 161 మ్యాచ్ లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. కాగా, వన్డేల్లో 100 విజయాలు సాధిస్తే, ఆ ఫీట్ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా ఈ జార్ఖండ్ డైనమైట్ రికార్డు పుటలకెక్కుతాడు.