ట్రై సిరీస్: భారత్ విజయం సాధిస్తుందా..?
టీమిండియా సిడ్నీలో 26న ఆస్ట్రేలియాతో, 30న పెర్త్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ఫైనల్ ఫిబ్రవరి 1న జరగనుంది. వరల్డ్ కప్ ముందు ఆసీస్లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. వరల్డ్ కప్ ముందు ఆసీస్లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ ఫైనల్ ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి.
ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించి నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడంతో మిగిలిన స్థానానికి ఇంగ్లండ్, భారత్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ జట్టు టీమిండియాపై బోనస్ పాయింట్తో విజయం సాధించినందున ఆ జట్టు మరో విజయం సాధిస్తే ఫైనల్కు చేరుతుంది.
టీమిండియా ఫైనల్కు చేరాలంటే మాత్రం బోనస్ పాయింటుతో పాటు మెరుగైన రన్ రేట్తో విజయం సాధించాల్సి వుంటుంది.