ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై స్పందించను : సచిన్ టెండూల్కర్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై తాను స్పందించబోనని భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ ఈ నివేదికపై తాను మాట్లాడటం సరికాదని చెప్పారు. ఫిక్సింగ్ కేసును సుప్రీంకోర్టు చూసుకుంటుందన్నారు.
స్పాట్ ఫిక్సింగ్లో ముద్గల్ కమిటీ గత వారం ఓ నివేదికను సమర్పించిన విషయం తెల్సిందే. ఇందులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఎలాంటి చర్యలకు పాల్పడలేదని నివేదికలో తెలింది. అయితే, ఈ ఫిక్సింగ్తో సంబంధం ఉన్న ఓ క్రికెటర్ ప్రవర్తనా నియమావళి కోడ్ ఉల్లంఘించినప్పటికీ ఆయన చర్యలు తీసుకోలేదని కమిటీ పేర్కొంది.
మరోవైపు తిరిగి తనను బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించాలని శ్రీనివాసన్ను సుప్రీంను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.