శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (10:25 IST)

సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును భారత యువ ప్లేయర్, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో నాలుగో వన్డే సందర్భంగా సెంచరీ చేసిన కోహ్లీ, టెండూల్కర్ రికార్డుల ఛేదనలో తొలి అడుగేశాడు. ఆ మ్యాచ్‌లో 127 పరుగులు చేసిన విరాట్, తన కెరీర్‌లో 20 సెంచరీలను పూర్తి చేశాడు. 
 
కేవలం 64 ఇన్నింగ్స్‌లోనే 20 సెంచరీలు చేసిన కోహ్లీ, అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను చేరిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో మొత్తం 49 సెంచరీలు చేసిన సచిన్, తొలి 20 సెంచరీలు చేసేందుకు 197 ఇన్నింగ్స్‌లు ఆడాడు. తాజాగా 64 ఇన్నింగ్స్‌లలోనే 20 సెంచరీలు పూర్తి చేయడం ద్వారా కోహ్లీ, సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టాడు.