గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (09:13 IST)

లార్డ్స్‌లో భారత్ గెలుస్తుందని ముందే ఊహించా : సచిన్

లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని తాను ముందే ఊహించానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. ఈ టెస్ట్ విజయంపై సచిన్ స్పందిస్తూ.. లార్డ్స్ టెస్టులో భారత్ విజయం సాధిస్తుందన్న విషయాన్ని తాను ముందే ఊహించానని తెలిపాడు. 
 
ఆ మ్యాచ్ తొలిరోజు ఆటను తనయుడు అర్జున్‌తో కలిసి వీక్షించిన సచిన్... ఆ రోజు ఆటలో టీమిండియా ప్రదర్శన చూసిన తర్వాత, గెలుస్తుందన్న అంచనాకు వచ్చానని వివరించాడు. యువజట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. మొదటి రోజు మ్యాచ్ అనంతరం, అర్జున్‌తో మనదే పైచేయి అని చెప్పాను అని సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడి ఉంటే మాత్రం వారికే మెరుగైన అవకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డాడు.