గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:46 IST)

షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ ట్వంటీ-20 పగ్గాలు!

పాకిస్థాన్ క్రికెట్ వన్డే జట్టు సారథిగా మిస్బావుల్ హక్‌ను కొనసాగించాలని నిర్ణయించిన పీసీబీ, ట్వంటీ-20 పగ్గాలను మాత్రం డైనమిక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి అప్పగించింది. మిస్బా వన్డే జట్టు సారథిగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడు.
 
ఇక, అఫ్రిది 2016 వరకు టి20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ మేరకు పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. టి20 జట్టుకు ఇప్పటివరకు మహ్మద్ హఫీజ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. క్రికెట్ కమిటీతో చర్చించాకే మిస్బా, అఫ్రిదిలను కెప్టెన్లుగా నిర్ణయించామని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు.