గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (16:25 IST)

ఐదు వన్డేల సిరీస్: షమీ అవుట్, కులకర్ణి ఇన్!

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా శ్రీలంకతో జరగనున్న ఐదు వన్డేల సిరిస్ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో ముంబై ఫాస్ట్ బౌలర్ ధావల్ కులకర్ణి జట్టులోకి ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటన ద్వారా వెల్లడించింది.
 
షమీ కుడికాలి వేలి గాయంతో బాధపడుతున్నాడని, అతనికి పది రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించడంతో షమీని జట్టు నుంచి తొలగించినట్లు సమాచారం. 
 
కాగా, షమీ స్థానాన్ని భర్తీ చేస్తున్న కులకర్ణి ఈ ఏడాదే అంతర్జాతీయ వన్డే (ఇంగ్లండ్ పై) అరంగేట్రం చేశాడు. తాజాగా, దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.