శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (17:21 IST)

వర్షంతో భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే మ్యాచ్ రద్దు!

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం సిడ్నీలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేలో భాగంగా టీమిండియా బ్యాటింగ్‌ మొదలుపెట్టి 16 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. 
 
అయితే భారీ వర్షం కురుస్తుండటంతో క్రికెట్‌ బోర్డు ఈ మ్యాచ్‌ను రద్దు చేసింది. మ్యాచ్‌ రద్దుతో ఇరు జట్లకు రెండు పాయింట్లు చొప్పున దక్కాయి. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 15 పాయింట్లతో ముందుండగా.. ఇంగ్లాండ్‌ 5, భారత్‌ 2 పాయింట్లు ఉన్నాయి. 
 
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ గెలిచినట్లయితే ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. లేదంటే టీమిండియా ఇంటిదారి పట్టాల్సిందే.