గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (15:01 IST)

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ : విరాట్ కోహ్లీ - భువనేశ్వర్‌లకు చోటు!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసిన వన్డే ర్యాంకుల పట్టికలో భారత క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలోనూ, బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌లు ఏడో స్థానంలో ఉన్నారు. 
 
అయితే, బ్యాటింగ్ విభాగంలో సఫారీ స్టార్ ఏబీ డీవిలీర్స్ అగ్రస్థానం పదిలపరుచుకోగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఏబీకి కోహ్లీకి మధ్య 25 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. మూడోస్థానంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా నిలిచాడు. ఇక, బౌలింగ్ విభాగంలో భారత యువ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ స్థానం ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. 
 
ఈ జాబితాలో, సస్పెన్షన్‌కు గురైన పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండో ర్యాంకులో, సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ మూడో ర్యాంకులో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నాలుగోస్థానంలో నిలిచాడు.