సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ: ట్విట్టర్లో విరాటే ఫస్ట్!
సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక టెస్టు, వన్డే పరుగులను, సెంచరీలను సాధించడంతోపాటు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ టెండూల్కర్ను యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మించి పోయాడు.
ట్విటర్లో అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న భారత క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు కోహ్లీకి అగ్రస్థానం లభించింది. అతనికి 48,70,190 మంది ఫాలోయర్స్ ఉండగా, సచిన్ ట్విటర్లో ఆ సంఖ్య 48,69,849. అయితే, అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పిన ఏడాది తర్వాత కూడా సచిన్ రెండో స్థానాన్ని ఆక్రమించడం విశేషం.