శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (11:32 IST)

భారత్ టూర్‌ మధ్యలో ఇలా జరగడం బాధగా ఉంది!

భారత్ టూర్‌ మధ్యలో స్వదేశానికి ప్రయాణం కావాల్సి రావడం బాధేస్తుందని విండీస్ ఆటగాళ్లు అంటున్నారు. విండీస్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ముదిరి పాకానపడడంతో ఆటగాళ్లు అర్ధాంతరంగా వెనుదిరుగుతున్నారు. 
 
స్వంత ఖర్చులతో స్వదేశం చేరి బోర్డుతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. కానీ విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి టీమిండియా అంటే ఎనలేని అభిమానం. టీమిండియా ఆటగాళ్లకు, విండీస్ క్రికెటర్లకు మంచి దోస్తీ ఉంది.
 
ఐపీఎల్‌లో ఆకట్టుకునేలా ఆడుతూ వస్తున్న విండీస్ ఆటగాళ్లకు భారత్‌లో భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. సిరీస్ మధ్యలో వైదొలగడం విండీస్ క్రికెట్ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.