శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (17:38 IST)

#INDvAUS: ఓవల్‌లో శిఖర్ ధవాన్ సెంచరీ.. పరుగుల వరద

ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా లండన్‍‌లోని ఓవల్ మైదానంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధవాన్.. 95 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో సెంచరీ (100) చేశాడు. ఇది శిఖర్ ధవాన్‌కు మూడో ప్రపంచ కప్ సెంచరీ కావడం గమనార్హం. గతంలో సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లపై సెంచరీ బాదాడు. ధవాన్ వన్డే కెరీర్‌లో17వ సెంచరీ. 
 
 అంతకుముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అర్థ సెంచరీ చేశాడు. రోహిత్ 70 బంతులు ఎదుర్కొని ఓ సిక్సర్, మూడు ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి, కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. 
 
అప్పటికి భారత్ స్కోరు వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. రోహిత్ ఔటైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చి ఓపెనర్ శిఖర్ ధవాన్‌కు తన వంతు సహకారమిస్తూ బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ 32 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 33 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 190 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది.