శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (17:48 IST)

నిర్భంధ తమిళంపై పవన్ పోరుబాట: అమ్మతో పెట్టుకోవద్దన్న బీజేపీ!?

నిర్భంధ తమిళ భాషపై పవన్ కల్యాణ్ తమిళనాట పోరుబాట పట్టాలనుకున్నట్లు మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నిర్భంధ తమిళ భాషకు చెందిన జీవో అమల్లోకి వస్తే తెలుగు భాష కనుమరుగవుతుందనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హోసూరులో ఆందోళన చేపట్టాలని భావించారు. అయితే ఆపై పవన్ కల్యాణ్ దీక్ష గురించి ఎలాంటి సమాచారం బయటికి పొక్కలేదు. ఇందుకు బీజేపీనే కారణమని వార్తలొస్తున్నాయి.  
 
నిర్భంధ తమిళంపై తమిళనాడు సీఎం జయలలితకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఆందోళన చేపట్టవద్దని బీజేపీ హైకమాండ్ విజ్ఞప్తి చేయడంతో పవర్ స్టార్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని సమాచారం. జయలలిత పార్టీతో సంబంధాలను పవన్ దీక్ష చెరపకూడదనే ఉద్దేశంతో బీజేపీ ఇలా చెప్పినట్లు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని రంగంలోకి దింపినట్లు సమాచారం. 
 
అమ్మతో పెట్టుకోవద్దని వెంకయ్య పవన్‌కు నచ్చజెప్పడంతోనే నిర్భంధ తమిళంతో తెలుగు కనుమరుగవుతున్నా పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా సైలెంట్ అయిపోయారని టాక్ వస్తోంది. బీజేపీ-అన్నాడీఎంకేల మధ్య సంబంధాలకు బ్రేక్ పడకుండా ఉండాలంటే.. పవన్ కల్యాణ్ ఆందోళన చేపట్టకూడదని.. హైకమాండ్ చెప్పేయడంతో పవన్ దీనిపై మారుమాట్లాడటం లేదని అంటున్నారు. అందుకే హైదరాబాదులో ఇటీవల జరిగిన తమిళనాడు తెలుగు యువశక్తి సమావేశంలోనూ పవన్ పాల్గొనలేదని వారు చెప్తున్నారు.