బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (11:06 IST)

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా.. రాహుల్‌కే ఆ బాధ్యతలు..?

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి పొత్తులు, ప్రచార కమిటీ బాధ్యతలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకే అప్పగించే దిశగా వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి పొత్తులు, ప్రచార కమిటీ బాధ్యతలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకే అప్పగించే దిశగా వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా కూలంకషంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ సర్కారుకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని స్పష్టం చేశారు. 
 
రాహుల్‌ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా నిర్వహించిన వర్కింగ్ కమిటీ సమావేశం ఉత్సాహంగా సాగింది. 23 మంది సభ్యులతో కూడిన కమిటీ వచ్చే సాధారణ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలపై కూలంకుషంగా చర్చ జరిపారు. రాష్ట్రాలు, సాధారణ ఎన్నికల ఎజెండా, అనుసరించాల్సిన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేశారు.
 
ముఖ్యంగా కేంద్రంలోని మోడీ సర్కారును ఎదుర్కొనేందుకు రాహుల్‌ నాయకత్వంలో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుందని తెలిపినట్లు వివరించారు. ఇందులో ప్రత్యేక హోదా అంశం కూడా వున్నట్లు తెలుస్తోంది.