శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:50 IST)

తిరుపతికి మొండిచేయి చూపించిన విత్తమంత్రి అరుణ్ జైట్లీ

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల. ప్రతిరోజు 50 నుంచి 70వేల మందికిపైగా భక్తులు తిరుపతికి వస్తూ వెళుతూ ఉంటారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల తాకిడితో తిరుపతి ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది.

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల. ప్రతిరోజు 50 నుంచి 70వేల మందికిపైగా భక్తులు తిరుపతికి వస్తూ వెళుతూ ఉంటారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల తాకిడితో తిరుపతి ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. అలాంటి తిరుపతిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఉంది. అయితే తిరుపతిని అభివృద్ధి చేయడంలో ఎప్పుడూ ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తుంటాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 
 
పార్లమెంటులో బుధవారం కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తిరుపతికి ఆశించిన మేరకు న్యాయం జరుగుతుందని భావించారు. అయితే బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగింది. తిరుపతికే కాదు... విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. కేవలం ఏపీలో అమరావతి రాజధాని భూములకు కేటాయించిన రైతులకు పన్ను రాయితీలను ఇచ్చింది కానీ ఎన్నో సమస్యలున్న ఏపీని గాలికొదిలేసిందన్న విమర్శలు లేకపోలేదు.
 
తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌తో పాటు తిరుపతిని సుందరీకరణ చేయడానికి ఎంతో నిధులు అవసరం. అలాగే విశాఖను రైల్వేజోన్ చేయాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ చేయాలన్న డిమాండ్‌ 12 సంవత్సరాల క్రితం మాట. లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వేశాఖామంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిని అంతర్జాతీయ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతానని, 2 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని ప్రకటించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేస్టేషన్‌‌ను అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. 
 
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సురేష్‌ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈయన ఏదేదో చేస్తారనీ, ఇచ్చేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ తిరుపతికే కాదు.. ఏపీకి చేసింది శూన్యమనే చెప్పాలి. సురేష్‌ ప్రభు తిరుపతిలో రెండు, మూడు సార్లు పర్యటించారు. చిత్తూరు జిల్లా తొట్టంబేడులో క్యారేజ్ రిపేర్ షాపు నిర్మాణం చేస్తానని, తిరుపతి రైల్వేస్టేషన్‌ను అన్ని విధాలుగా అభివద్ధి చేస్తానని చెప్పాడు. కానీ అంతా మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో సాధ్యం కాదు. పైగా రెండు బడ్జెట్‌లు ఒకేసారి కావడం (ఆర్థిక బడ్జెట్, రైల్వేబడ్జెట్ ) రెండూ ఒకేసారి ప్రవేశపెట్టడంతో గందరగోళం నెలకొంది.