తెరాసలో చేరిన ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలి!
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవులను అనుభవించి, ఇపుడు ప్రతిపక్ష హోదాలో ఉండలేక, ఎమ్మెల్సీ పదవుల గడువు పెంచుకునేందుకు ఆకస్మికంగా తెరాసలో చేరిన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ వెంటనే అనర్హులుగా ప్రకటించాలని టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిఎల్పి ఉపనేత డా.జె. గీతారెడ్డి, డికె. అరుణ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్తోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగదీశ్వర్రెడ్డి కాంగ్రెస్లో అయిదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహారించే ఓపిక లేకనే, అధికారం కోసం తెరాసలో చేరారని అరుణ విమర్శించారు. అధికారం కోసమే తెరాసలో చేరిన వారు తాము బంగారు తెలంగాణలో ప్రభుత్వానికి సహకరించేందుకే పార్టీలో చేరామని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీలు, బంగారు తెలంగాణ పదానికి నిర్వచనం చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు.