శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (12:13 IST)

ఇంద్రాణి... ఆల్‌రౌండ్ వంచకి... మొగుళ్లందరూ సౌండ్ పార్టీలే

దేశంలో సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య కేసును తవ్విన కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అలాగే, క్షణంక్షణం ఊహించని మలుపులు తిరుగుతోంది. టీవీ మొఘల్, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య, షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టు కావడమే హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా, ఈమె గత చరిత్రను తిరగేస్తే వళ్లు గుగుర్పాటుకు గురిచేసే నిజాలు వెలుగుచూస్తున్నాయి. చీకటి కోణం వెనుక.. డబ్బు మాటున చేసిన అనేక అమానవీయ వైపరీత్యం వెలుగు చూస్తోంది.
 
 
తనకు ఒకే ఒక్కసారి వివాహమైందని, తన వెంట ఉన్న పిల్లలు తమ్ముడు, చెల్లెలని పీటర్ ముఖర్జియాను నమ్మించి బుట్టలో వేసుకుంది. అలా ఆమె ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు సమాచారం. పైగా ఇంద్రాణి మాయమాటలకు బుట్టలో పడినవారంతా మంచి సౌండ్ పార్టీలే కావడం గమనార్హం. ఇంద్రాణిని కుమార్తే షీనా బోరా హత్య కేసులో అరెస్టు చేసిన తర్వాత అనేక విస్మయకర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పైగా... ఈమె చేతిలో మోసపోయిన వారందరూ ధనికులే కావడం గమనార్హం. దీంతో ఆమెకు పుట్టిన పిల్లలంతా ఎవరికి పుట్టారన్న సందేహం కూడా కలుగుతోంది. 
 
ఇంద్రాణి అసలు పేరు పారిబోరా. ఆమె ఊపెన్ బోరా కుమార్తె. ఇంద్రాణి తన తల్లిదండ్రులతో కలిసి గౌహతిలోని సుందర్ నగర్‌లో నివాసముండేది. 1988లో ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. రెండేళ్ళ తర్వాత ఇద్దరు పిల్లలతో ఇంటికి తిరిగివచ్చింది. ఆ ఇద్దరు పిల్లలో షీనా బోరా, మిఖాయిల్ బోరా. అంటే ఇంద్రాణికి 14 యేళ్లకే వివాహం జరుగగా, 16 యేళ్ళకే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఈ ఇద్దరు పిల్లలు సిద్ధార్థ్ దాస్ వల్లే పుట్టారని ఇంద్రాణి చెపుతుండగా, ఆయన మాత్రం తనకు పుట్టలేదని గట్టిగానే వాదిస్తున్నాడు. దీంతో షీనా, మిఖాయిల్‌లు ఎవరికి పుట్టారన్నది తేలాల్సి వుంది. ఈ సిద్ధార్థ్ దాస్ త్రిపురలో ఏ తేయాకు ఎస్టేట్ యజమాని. 
 
ఆ తర్వాత ఇంద్రాణికి వయస్సు 19 యేళ్లు ఉన్నప్పుడు అంటే 1990లో సంజీవ్ ఖన్నాతో పరిచయమేర్పడింది. ఇది మరింత సన్నిహితంగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, సిద్ధార్థ్‌తో పెళ్లయిన విషయం గానీ, తనకు పిల్లలున్నారనే విషయం గానీ ఆమె సంజీవ్‌ ఖన్నాకు చెప్పలేదు. కానీ, సంజీవ్‌తో వివాహానికి ముందే సిద్ధార్థ్‌కు అంటే 1993లో విడాకులు ఇచ్చారు. 
 
సంజీవ్ ఖన్నాతో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత పీటర్ ముఖర్జియాతో పరిచయం ఏర్పడి ఆయనతో సహజీవనం చేసింది. సంజీవ్ ఖన్నాకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ ముఖర్జియాతో సహజీనం చేస్తూ వచ్చింది. వీరందరికి కంటే ముందు మరో భర్త కూడా ఉన్నట్టు సమాచారం. ఈయనకే షీనా బోరా, మిఖాయిల్ బోరా పుట్టినట్టు సిద్ధార్థ్ దాస్ మాటలను బట్టితెలుస్తోంది. మొత్తంమీద ఇందాణి ఆల్‌రౌండ్ వంచకి అనే విషయం తెలుస్తోంది.