శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (14:40 IST)

పురంధరేశ్వరి ఏం చెప్పారు...? నవ్వుతూ వచ్చిన ఎమ్మెల్యే రోజా...

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చామా అన్నది ముఖ్యం కాదు.. నిలబడ్డామా లేదా అన్నదే ముఖ్యమన్న చందంతో ముందుకెళుతున్నారు రోజా. ఆమె నోరు తెరిస్తే ఇక అధికారపార్టీ నాయకులు చెవులు మూసుకోవాల్సిం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చామా అన్నది ముఖ్యం కాదు.. నిలబడ్డామా లేదా అన్నదే ముఖ్యమన్న చందంతో ముందుకెళుతున్నారు రోజా. ఆమె నోరు తెరిస్తే ఇక అధికారపార్టీ నాయకులు చెవులు మూసుకోవాల్సిందే. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే రోజా ప్రస్తుతం వైకాపాలో నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రోజా వాగ్ధాటికి ఎవరూ నిలవలేరన్న విషయం స్వయంగా జగన్‌కే తెలుసు. అందుకే పార్టీలోకి ఎవరిని పిలవాలన్నా స్వయంగా రోజానే జగన్ రంగంలోకి దింపుతున్నారట. కారణం.. అయితే ఆర్కాట్.. లేదా వాలాజా.. తమిళంలో ఇది ఒక సామెత. దానర్థం..అయితే అవుతుంది..లేదంటే లేదని..అలా రోజా వ్యవహరిస్తారు కాబట్టి.
 
ప్రస్తుతం మాజీ కేంద్రమంత్రి పురందరేశ్వరి వైకాపా తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయం కావడంతో ఆమెతో సంప్రదింపులు జరపడానికి జగన్ రోజాను పంపారంట. గత కొన్నిరోజుల ముందు బెంగుళూరులో జగన్‌ను కలిసిన పురందరేశ్వరి వైకాపాలోకి వస్తానని చెప్పొచ్చారట. అయితే పురందరేశ్వరి ఆహ్వానం పలికిన జగన్ ఆ తరువాత రోజా ద్వారా పురందరేశ్వరితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పురందరేశ్వరి ఆమెకు ఆమే పార్టీలోకి వస్తానని చెప్పడంతో జగన్‌కు బాగా కలిసొచ్చే అంశమైంది. పురందరేశ్వరికి ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రస్తుతం బిజెపి నుంచి ఆమె అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ వరకు అందరూ నాయకులతో మంచి పరిచయాలున్నాయి.
 
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఖచ్చితంగా పురందరేశ్వరి లాంటి వ్యక్తి అవసరం. అందుకే జగన్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజాను పంపి పురందరేశ్వరితో మాట్లాడి రమ్మని చెప్పారట. హైదరాబాద్‌లో ఉన్న పురందరేశ్వరిని రోజా మర్యాదపూర్వకంగా కలిసి వైకాపాలోకి రమ్మని కోరారట. 40 నిమిషాలకు పైగా పురందరేశ్వరి, రోజాకు మధ్య ఆసక్తికర చర్చ జరిగిందట. త్వరలోనే వైకాపాలోకి వస్తానని పురందరేశ్వరి చెప్పడంతో నవ్వుతూ బయటకు వచ్చేశారట రోజా.